
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
12/9/1995 లో కోవేట్ కాల్ దీయ అనేటువంటి ప్రాంతంలో ప్రారంభమై చాకోప శాఖలుగా ఎదుగుతూ ఈ దినమున 3/7/2009 శ్రీకృష్ణ చైతన్య పూర్ణ కమిటీ అనేటువంటి నామధేయంతో కమిటీ రూపకల్పన పొంది ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగి పోతూ ఉంది.
ఈ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం భగవద్గీతను చదువుతూ, చదివిస్తూ, ఆచరిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్ష.
భగవద్గీత అందరి ఇంటిలో, అందరి హృదయంలో ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పట్టుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది.
భగవద్గీత యొక్క సారాన్ని ఉపన్యాసాల ద్వారా తెలియజేస్తూ, భగవద్గీతను పట్టుకుందాం, తలరాతలను మార్చుకుందాం. కుల, మత, వర్ణ భేదం లేకుండా ఈ ధర్మ యజ్ఞంలో ఎవరైనా పాల్గొనవచ్చు.
ఇదే కాకుండా మన భారతదేశంలో బద్వేలుకు అతి దగ్గరలో నందిపల్లి అనేటువంటి ఊర్లో శ్రీకృష్ణ మందిరం, గోశాల, వృద్ధాశ్రమం, వీరభద్ర స్వామి గుడి నిర్మించబడ్డాయి. ఈ మహా యజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చు.
ధర్మం పట్ల, జ్ఞానం పట్ల అందరికీ పట్టుత్వం రావాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కమిటీ ఒక్క లక్ష్యం.
భగవద్గీతను చదివితే మన అందరి జీవితాలలో వెలుగును ఇస్తుంది. శ్రీకృష్ణ భగవానుడే దేవుడు. భగవాన్ నామమే మంత్రం. భగవద్గీత మన అందరికీ శాస్త్రం.
సంసార దుఃఖమును, మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలంటే ఏకైక మార్గం శాస్త్రాన్ని చదవడం.
హరిహి ఓం త సత్
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః
భక్తిశ్రద్ధలతో ఈ యజ్ఞంలో ఎవరైనా పాల్గొనాలి అనుకున్నటువంటి వారు కమిటీ వారితో సంప్రదించండి.
కమిటీ సభ్యులు
మా కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి తమ సమయం, శ్రమ మరియు అంకితభావాన్ని సమర్పించిన సేవాభావం గల వ్యక్తులు. వారి సమిష్టి కృషి, నిస్వార్థ సేవ మరియు నిబద్ధతతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, మా సంస్థను నడిపించే సనాతన ధర్మ విలువలు మరియు శ్రీకృష్ణుని దివ్య బోధనలను పరిరక్షించి తదుపరి తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.



![]() | ![]() | ![]() | ![]() |
|---|---|---|---|
![]() |














